బండ్లగూడ, జూలై 1: రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపిన ప్రకారం, మహబూబ్నగర్కు చెందిన ఆరిఫ్బేగం(49) జడ్చర్ల, రాజాపూర్ వద్దనున్న తిరుమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. కాగా, ఎల్బీనగర్లో ఉన్న ఆమె అన్నను చూసేందుకు నగరానికి వచ్చింది.
ఆరాంఘర్ చౌరస్తా వద్ద బస్సు దిగి ఎల్బీనగర్ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా, ఇంతలో అటుగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనదారున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.