మంజూరైన వీడీసీసీ రోడ్ల ప్రాంతాల్లో
తాగునీరు, మురుగునీటి నిర్మాణ పనులు చేపట్టండి
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): నూతనంగా వీడీసీసీ రోడ్లు మంజూరైన ప్రాంతాల్లో అవసరమైన తాగునీరు, డైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వాటర్ వర్స్ ఎండీ దాన కిశోర్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలోని పలు నియోజకవర్గాల్లో ప్రజలు ఎదురొంటున్న రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిషారానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో ఏర్పడే వరదనీటి సమస్య పరిషారానికి, డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య నివారణ కోసం నూతనంగా అనేక పనులను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆ పనుల్లో కొన్ని చోట్ల శంకుస్థాపన చేశారని, మరికొన్ని పనులను ఇంకా చేపట్టలేదంటూ పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. మంజూరైన పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు. చాలా చోట్ల డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ పనులు పూర్తికాక పోవడం వలన రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, వెంటనే పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి, పూర్తిచేసే విధంగా అధికారులను ఆదేశించాలని ఎండీ దాన కిశోర్కు మంత్రి సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతో నగరంలో నూతనంగా డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల నిర్మాణం, పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. త్వరలోనే నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కలిసి సుంకిశాల ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, వాటర్ వర్స్ ఈఎన్సీ కృష్ణ, డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.