కొండాపూర్, డిసెంబర్ 1 : శేరిలింగంపల్లి సర్కిల్ -20లోని కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాలనీలు, బస్తీల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ నగర్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దిశగా రూ.50 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైన్ను నిర్మిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ ఇబ్బందులు తలెత్తకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించేలా పనులు చేపట్టారు.
కొండాపూర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నాం. ఇప్పటికే డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌతొక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో డ్రైనేజీ ఇబ్బందులు తలెత్తకుండా కాలనీకి సరిపడ పరిమాణం పైపులతో లైన్ల నిర్మాణం సాగుతుంది. సీసీరోడ్లు, యూజీడీ, వీధి దీపాలు, మంచినీటి పైపులైన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నాం.
– హమీద్ పటేల్, కొండాపూర్ కార్పొరేటర్
ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోపాలు జరుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అభివృద్ధి పనులతో పాటుగా రోడ్లపై ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు మూసివేసే చర్యలు చేపడుతున్నాం.
– జగదీశ్, కొండాపూర్ ఏఈ