మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 15 : ఆకు కూరల సాగుపై రైతులు దృష్టి సారించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.శామీర్పేట మండల పరిధిలోని పొన్నాలలో పెద్దిరాజు రైతు పొలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆకుకూరలు అవసరం ఉందని, కాని 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపారు.
ఇందుకు రైతులు ఆకు కూరల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సరోజిని దేవి, ఏడీఏ సువర్ణ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల , ములుగు అధికారులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.