Farmers Protest | ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన వడ్లు, మక్కలను కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షం పడితే తీరని నష్టం కలుగుతుందని, వెంటనే పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులకు ఆందోళన విషయాన్ని వివరించారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు
నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని రోడ్డెక్కి నిరసనకు దిగిన రైతులు
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు
వర్షం పడితే తీరని… pic.twitter.com/1ZVghYclk0
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు
నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని రోడ్డెక్కి నిరసనకు దిగిన రైతులు
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు
వర్షం పడితే తీరని… pic.twitter.com/1ZVghYclk0
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు
నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని రోడ్డెక్కి నిరసనకు దిగిన రైతులు
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు
వర్షం పడితే తీరని… pic.twitter.com/1ZVghYclk0
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026