యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదు. నాడు అన్నదాతను అరిగోస పెట్టింది వారే. కాంగ్రెస్ పాలనే దరిద్రం. రైతు సంక్షేమం తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24గంటల కరెంటు, నాణ్యమైన విత్తనాలు, రైతుబంధుతో రైతులను రాజును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నదాత జీవితాల్లో నిప్పులు పోయాలని చూస్తున్నది. 3గంటల కరెంటుతో నారుమడి కూడా తడ్వదు. కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెబుతం. ఎవుసాన్ని పండుగలా మార్చి, తమ గోస తీర్చిన కేసీఆర్ను మళ్లోసారి గెలిపించుకుంటం.
– సింగం పోశాలు, అంబేద్కర్నగర్, జవహర్నగర్
కాంగ్రెస్ వస్తే ధరణి ఎత్తేస్తం అంటున్నరు. మళ్లీ పాత కౌల్దారీ, పట్వారీ పద్ధతి తీసుకొస్తరట. ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎనకటి రోజులు గుర్తు కొస్తున్నాయి. భూముల ధరలు పెరగడంతో ధరణి లేకపోతే అన్ని సమస్యలు, అక్రమాలు రాజ్యమేలుతాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న రైతులను ఆగం చెమ్యొద్దు. భూ సమస్యలు సమూలంగా పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో సమస్యలు పరిష్కారమయ్యాయి. రికార్డులు భద్రంగా ఉన్నాయి. ఎప్పడు కావాలంటే అప్పడు ఆన్లైన్లో చూసుకుంటున్నం. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహంతోనే సాగు మంచిగా చేసుకుంటున్నం. పంటలు బాగా పండిస్తున్నం. రైతుల మద్దతు బీఆర్ఎస్కే.
– బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఘట్కేసర్
కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తమంటున్నది. వేస్తే మళ్లీ అధికారుల చుట్టూ తిరిగాల్సి వస్తది. ధరణి పోర్టల్తోనే భూ రికార్డులు పదిలంగా ఉన్నవి. ధరణి పోతే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. ధరణి లేకముందు భూముల రికార్డులన్నీ పట్వారీలు, వీఆర్వోల చేతిలో ఉండేవి. ఒకరి భూములను మరొకరి పేరు మీద మార్చేవారు. రైతులకు అవసరమొచ్చినప్పుడు పోయి చూస్తే భూమి ఎవరిపేరు మీదనో ఉంటుండే. సీఎం కేసీఆర్ వచ్చినంక రైతుల బాధలు పోగొట్టిండు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూముల వివరాలు పకడ్బందీగా చేసిండు. ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. భూమి యజమాని వెళ్లి వేలుముద్ర వేస్తే తప్ప లేకుండా భూమి మార్పిడి జరగడం లేదు. అందుకే రైతులంతా కేసీఆర్కే మద్దతివ్వాలి.
– అన్నారం ప్రభాకర్, రైతు, కోనాయిపల్లి , మేడ్చల్
ధరణిని ఎత్తేస్తే రైతుల భూమికి పూర్తి రక్షణ పోతుంది. మళ్లీ వ్యవసాయం పరిస్థితి మొదటి కొస్తుంది. సీఎం కేసీఆర్ హయాంలో రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూశాం. కాంగ్రెస్ వస్తే రైతులు మరి ఆగమయ్యే పరిస్థితులొస్తయి. మళ్ల పాత పద్దతి తీసుకొచ్చి మన పైన రుద్దుతరంట. గిట్లనే జేస్త తెలంగాణలో కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా పోతది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చూస్తాం. రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే అండగా ఉంటాం. మన సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. రైతులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే.
– చంద్రశేఖర్ యాదవ్, రైతు, కీసర
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్లిచ్చే 3 గంటల కరంటుతో రైతు ఎవుసం ఆగమవుతది. 10 హెచ్పీ మోటరు పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఎనకటి రోజులు కండ్లముందు కదలాడుతున్నాయి. అప్పట్లో బావుల దగ్గరకు పోయి కాపలా కాసి నీళ్లు పారబెడుతుండే. రాత్రింభవళ్లు బాయి దగ్గరే ఉంటుండే. ఆ కరెంటుతో పొలం సరిగా పారక నెర్రెలు బాసినయి. కాంగ్రెసోళ్లు రైతుబంధు కౌలు రైతులకిస్తం అంటుంటే మల్ల మాకు కష్టాలు వచ్చినట్టే అనిపిస్తోంది. సీఎం కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇస్తున్నడు. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయం పండుగ చేసిండు. బీఆర్ఎస్ పాలనలో పొలమంతా వరి నాటుకున్న. సరిపడ పంట దిగుబడి వచ్చి దర్జాగా బతుకుతున్న. రైతులందరం ఏకమై కేసీఆర్నే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం.
– వెంకటేశ్, రైతు, మర్రిపల్లిగూడ
కాంగ్రెస్ నాయకులంటున్న 3 గంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్తో వ్యవసాయం చేయడం కష్టం. పొలాలు ఎండిపోవడం ఖాయం. వారి గత పాలన రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వారిచ్చే కరెంటు మధ్య మధ్యలో పోయి వస్తుండే. నారు మడి కూడా సక్రమంగా పారక పగుళ్లు వస్తుండే. పారిన చోటనే పారి పొలమంతా ఎండిపోతుండే. 3 గంటల కరెంట్తో వ్యవసాయం ఎలా చేస్తరో కాంగ్రెస్ చెప్పాలె. సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల కరెంట్తో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నాం. రైతులమంతా సంతోషంగా ఉన్నాం. మంచి చేస్తున్న వారికే మా సంపూర్ణ మద్దతు.
– జి. శ్రీనివాస్రెడ్డి, గౌడవెళ్లి గ్రామం, మేడ్చల్ మండలం
కాంగ్రెస్ వస్తే టార్చిలైటు పట్టుకొని బాయికాడికి పోయే పరిస్థితులొస్తాయి.ఆనాటి వారి పాలనలో పంటలు పండించుకోవాలంటే నరకయాతన పడ్డం. అడపాదడపా వచ్చిన కరెంటుతో పంటలు పండక అవస్థలు పడినం. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందన్న కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి. అప్పటి రోజులు తలచుకుంటే భయం వేస్తోంది. సీఎం కేసీఆర్ వచ్చినంక ఉచితంగా 24గంటల కరెంటు, పెట్టుబడిసాయంతో ఏడాదికి రెండు పంటలను సంబురంగా సాగు చేసుకుంటున్నాం. 10హెచ్పీ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఖాళీపోతాయి. వీటి రిపేర్ల ఖర్చు రైతుల మీదనే వేస్తారు. అప్పుల బాధలు పెరిగి రైతు ఆత్మహత్యలు జరుగుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పూర్తి భద్రత ఉంది.
– శోభన్ బాబు, రైతు, జవహర్నగర్
కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టాలు వర్ణణాతీతం. రైతులకు సరిపడా విద్యుత్ అందకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలు ఉన్నాయి. కష్టపడి సాగు చేసిన వరి పంటలు విద్యుత్ కోతలతో ఎండిపోతుంటే అప్పుడు రైతులు గుండెలు బాదుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయ రంగంలో పూర్తిగా నష్టపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల నాణ్యమైన కరెంట్తో పంటలు మంచిగా పండించుకుంటున్నాం. బీఆర్ఎస్ పాలనలో రైతాంగం చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాలు తల్చుకుంటేనే భయమేస్తుంది. మాకు మూడు గంటల కరెంటు వద్దు..కాంగ్రెస్ పార్టీ కూడా వద్దు. మరోసారి కేసీఆర్ సర్కారే రావాలి.
– నల్ల శివారెడ్డి, కీసర రైతు
ధరణిపై కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ధరణి ఎత్తేసి పాత వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు తీసుకొస్తామంటున్నారు. మళ్లీ రైతులు కార్యాలయాలు చూట్టు తిరిగాల్నా? రికార్డుల గందరగోళం , అసలు భూమి మన పేరుమీదనే ఉండదు. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే భయమేస్తోంది. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ పోర్టల్లో నమోదైన భూమి యజమానులకు ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. ఇంత మంచి ధరణిని తొలగిస్తామంటున్న కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెబుతాం. సీఎం కేసీఆర్ వైపే రైతులమంతా ఉంటాం.
-మల్లేశ్, రాంపల్లి
కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేసి కౌల్దారీ విధానం, పట్వారీ వ్యవస్థను తెస్తరట. అవి గనుక తెస్తే రైతులకు గోసలు తప్పవు. మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగాలి. ఎద్దు, ఎవుసం బంద్ పెట్టుకొని గాన్నే కాపుగాయాలి అధికారుల కోసం. పైరవీలు చేస్తేనే పనులవుతాయి. మన భూములు మన పేరు మీద ఉండవు. గీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిండు సీఎం కేసీఆర్. రైతుల కోసం తీసుకొచ్చిన ధరణితో ఇప్పటి వరకు రైతులకు ఉన్న కష్టాలు దూరమయ్యాయి. ప్రస్తుతం ఆన్లైన్ రికార్డుల్లో ఎవరి భూములు వారి పేరు మీదే భద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ సీఎం చేయలేని పనిని రైతుల కోసం మన కేసీఆర్ చేశారు. వారికే అండగా ఉందాం.
– కె.మల్లేశ్, రైతు, అన్నోజిగూడ, పోచారం మున్సిపాలిటీ.