ముషీరాబాద్, జూన్ 21: సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముఠా జైసింహ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం గాంధీభవన్ వేదికగా కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అభిలాష్, తుంగ బాలు, శ్రీధర్ రెడ్డి, బల్ల శ్రీనివాస్రెడ్డి, రాకేష్ కుమార్, దీన్ దయాల్ రెడ్డి, మాధవ్, చిట్టి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.