సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ పేరుతో నకిలీ ఇన్స్టా గ్రామ్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు తెరవడంతో దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
అంజనీ-కుమార్-1100 పేరుతో ఈ నకిలీ ఖాతాను గుర్తించారు. దీనిపై డీజీ పీఏ హలీమ్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఏసీపీ చాంద్భాషా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ మధులత బృందం దర్యాప్తు చేస్తోంది.