సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 27వ రోజు 27,249 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 5,853 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 3,317 మందికి ప్రిస్కిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
నగరంలో 115 కేంద్రాల్లో 27వ రోజు 9,960 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. వీరిలో 2,772 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేసి, 1,443 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
మొత్తం 80 కేంద్రాల ద్వారా 27వ రోజు 9,854 మందికి కంటి పరీక్షలు జరిపామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిలో 1,261 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసి, 1,084 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామని అన్నారు.
మొత్తం 79కేంద్రాల ద్వారా 27వ రోజు 7,435 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. వీరిలో 1,820 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసి, 790 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి, ఫిబ్రవరి 27 : జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. యశ్వంత్, ఝాన్సీ, ముస్తఫా, ముసాబ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్కే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.ఆంజనేయులు, కోచ్ అశోక్ పాల్గొన్నారు.