ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ ఆరో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ప్రొఫెసర్ నగేశ్ సూచించారు.