మియాపూర్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐఏయువైఎస్ఏ ఆద్వర్యంలో 15 కిలోమీటర్ల సైకిల్ రైడ్ను గచ్చిబౌలిలోని ఏహెచ్బిసి వద్ద ఆదివారం నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించడానికి ఐఏయువైఎస్ఏ బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 150 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని హైటెక్సిటీ, గచ్చిబౌలి నుంచి ఐకియా బయోడైవర్సిటీ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ గుండా సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ ఐఎంఎస్ సంస్థ నిర్వాహకులు నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ ప్రాతినిథ్యం పెంచటమే లక్ష్యంగా సంస్థ కృషి అభినందనీయమన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.