ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) సెమిస్టర్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎంఎస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.
ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడొచ్చని ఆయన సూచించారు.