మల్కాజిగిరి, అక్టోబర్ 25: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. లేఖ ప్రతిని టీఎస్పీసీసీ అధ్యక్షుడికి స్పీడ్ పోస్టు ద్వారా పంపించినట్టు తెలిపారు.