Talasani Srinivas Yadav | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం చార్మినార్ ఈస్ట్లోని చౌక్ మైదాన్లోని బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన వెంట ఆలయ ట్రస్టీలు రాజేందర్ పిట్టి, శ్రీనివాస్ బన్సాల్, రామ్ నివాస్ బన్సాల్, పియూష్ గుప్తా, మహావీర్ జైన్, రమణాచారి మహారాజ్, ఆత్రీయ స్వామి మహరాజ్ తదితరులు ఉన్నారు. అలాగే మాజీ మంత్రి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. మ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ట్రస్టీ శశికళ తీర్థ ప్రసాదాలు అందజేసి, సత్కరించారు.