రవీంద్రభారతి, ఆగస్టు 2: విద్యా, ఉద్యోగ రంగాలలో పూర్తి స్థాయిలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్లు అమలు, ఓసీ నిరుద్యోగులకు ఐదేండ్లు వయో పరిమితి పెంపును కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నా రు. బషీర్బాగ్లో ఆయన కార్యాలయంలో ఓసీ ఐక్య రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి సోమవారం నిర్వహించిన సమావేశంలో రామారావు మా ట్లాడారు. ఎన్నో ఏండ్లు పార్టీలకు అతీతంగా అనేక సంఘాలు చేసిన పోరా ట ఫలితంతోనే ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు దక్కాయన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యా, ఉద్యోగ రంగాల లో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినట్లుగా వయోపరిమితిని పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్, ఆర్ధిక శాఖమంత్రి హరీష్రావులకు పోలాడి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలాడి రామారావును సమైక్య నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రాంరెడ్డి, బి.శ్రీనివాసు, డా॥ దీపక్ బాబు, గూడూ రు స్వామిరెడ్డి, బి.శ్రీనివాసరావు, జి.రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.