పలు చోట్ల బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ
ఘట్కేసర్,ఏప్రిల్ 9 : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ కోరారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాల అదాలత్ పోస్టర్ను శనివారం ఘట్కేసర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బాలలకు కొన్ని హక్కులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు వెంకట్రెడ్డి, రమాదేవి, సంగీత, ఆంజనేయులు గౌడ్, అనురాధ, నాగజ్యోతి, శశికళ, జాంగీర్, నరేశ్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు శౌకత్మియా, అదాలత్ సభ్యురాలు సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
బోడుప్పల్ కార్పొరేషన్లో…
బోడుప్పల్ : బోడుప్పల్ పరిధిలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో బాల అదాలత్ పోస్టర్ను అంగన్వాడీ టీచర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 12న మేడ్చల్ జిల్లా పరిషత్ కమిటీ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు బాల అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేటర్ నర్సింహ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం బాల అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించారు. కౌన్సిలర్లు మమత, సురేఖ, అంగన్వాడీ టీచర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.