మేడ్చల్కలెక్టరేట్,నవంబర్ 26: భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని, రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సూత్రాల పట్ల అంద రూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్, నవంబర్ 26: మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనలు అనుసరించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, వైఎస్ఎంపీపీ వెంకటేశం,ఎంపీటీసీ సభ్యుడు కటిక ప్రకాశ్, ఎంపీడీవోపద్మావతి పాల్గొన్నారు.
కీసర,నవంబర్ 26: మండల పరిషత్ కార్యాలయం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో రమాదేవి, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.
శామీర్పేట: శామీర్పేట మండల పరిషత్ కార్యాలయాల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీవో సునీత, సూపరింటెండెంట్ సంపత్కుమార్, ఎంపీటీసీలు అశోక్, ఇందిరా, సిబ్బంది, మాలమహానాడు మండల అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామాల అధ్యక్షులు నేతలు లింగం, బాలేష్, బాలు, కాలీదాస్, నరేశ్, భరత్, అనిల్, ప్రకాశ్, జగదీశ్, దేవరయాంజాల్లో మాజీ ఎంపీటీసీ జైపాల్రెడ్డి, దేవాలయ మాజీ ధర్మకర్త నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు హరికృష్ణా, సుధాకర్రెడ్డి, రామ్మోహన్రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతర రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు.