హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ కోరారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో కార్యక్రమంలో భాగంగా అమీర్పేటలోని తమ నివాసంలో తన సతీమణి రాధతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అనంతరం తన స్నేహితులు మహేష్, రమేష్, సతీష్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సవాల్ విసిరారు.