ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సుల్తాన్నగర్, యూపీ గల్లీ ప్రాంతాల్లో స్థానిక మైనార్టీలు గోపీనాథ్కు స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అంతర్గత రోడ్లు, సివరేజీ, తాగునీటి సౌకర్యాలు పై బస్తీలలో ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉండటం వల్ల కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. పాదయాత్రలో బల్దియా, జలమండలి, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొని ఎమ్మెల్యే సమక్షంలో స్థానికుల నుంచి వినతి పత్రాలను స్వీకరించటం జరిగింది.
పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలను వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తే త్వరితగతిన పరిష్కారం చేయటానికి వీలవుతుందని.. అలాగే వదిలేస్తే సమస్య జఠిలంగా మారి ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, నేతలు పల్లవియాదవ్, గంట మల్లేష్, కల్యాణి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్ సౌత్ శంకర్లాల్నగర్లో రూ.45 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్నిటికన్నా వెనుకబడ్డ ఎర్రగడ్డ డివిజన్ పై ప్రత్యేక దృష్టిని సారించి 7 ఏండ్లలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ నేతలు పల్లవియాదవ్, కల్యాణి, గౌస్ఖురేషీ, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.