మేడ్చల్ జోన్ బృందం, జనవవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని, భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో వివిధ మండలాలు, మున్సిపాలిటీల్లో బుధవారం ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలు నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు.