ఎల్బీనగర్, ఆగస్టు 24 : ప్రతి ఒక్కరూ విధిగా టీకాలు వేయించుకోవాలని సరూర్నగర్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఉదయం కొత్తపేట డివిజన్ మోహన్నగర్ జనప్రియ క్వార్టర్స్ కమ్యూనిటీ హాల్లో కొవిడ్ మోబైల్ వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉప కమిషనర్ హరి కృష్ణయ్యపర్యవేక్షించారు.
ఈ సందర్భంగా హరి కృష్ణయ్య మాట్లాడుతూ.. సరూర్నగర్ సర్కిల్లో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకాలు విధిగా వేసుకోవాలని ఆయన సూచించారు.
కాలనీల సంక్షేమ సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు చొరవ తీసుకుని 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో నోడల్ అధికారి రవీందర్, శివరాజు, అశ్విన్ సింగ్, లక్ష్మయ్య, చిరంజీవితో పాటుగా కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.