న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారతదేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే థియేటర్లు, ఆడిటోరియాలు మూసివేయాలని, ఇండోర్ సమావేశాలపై కనీసం రెండు నెలల పాటు పూర్తిగా నిషేధం విధించాలని ప్రముఖ అంతర్జాతీయ వైద్యపత్రిక ‘లాన్సెట్’.. కొవిడ్ 19 కమిషన్ ఇండియాలో నియమించిన టాస్క్ఫోర్స్ సూచించింది. పెండ్లిళ్లు, పండుగలు తదితర మతపరమైన, సామాజిక కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కుంభమేళా, ఎన్నికలు వైరస్ తీవ్రంగా వ్యాపించడానికి కారణమని పేర్కొన్నది. ఈ మేరకు భారత్లో కరోనా వ్యాప్తిపై టాస్క్ఫోర్స్ ఒక నివేదికను విడుదల చేసింది. వచ్చే రెండు నెలలపాటు పది కన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని, కఠినమైన నిఘా పాటించాలని సూచించింది. రోజూ లక్షల కేసులు నమోదవుతుంటే రాజకీయసభలు, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని గుర్తు చేసింది. టెస్టింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ విధానాన్ని సమర్థంగా కొనసాగించాలని సూచింది.