బేగంపేట్, మార్చి 12 : భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీంలో భాగంగా రూ.50 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన సౌండ్ లేజర్ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ వజ్రం కథను ఈ లేజర్ షోలో వివరించారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈ కథకు ప్లేబ్యాక్ సింగర్గా గాయనీ సునీత, సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ అందించారని చెప్పారు. ఈ షోను తిలకించేందుకు సుమారు వెయ్యిమంది పర్యాటకులు కూర్చునే విధంగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.