వెంగళరావునగర్, జూన్ 30: పేదోళ్ల దవాఖానపై సర్కారు పెద్ద మనస్సు చూపింది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖాన ఒకప్పుడు అరకొర వసతులతో కునారిల్లేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ, మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఈ ఛాతి ఆసుపత్రిలో విలువైన వైద్య పరికరాలు, ఐసీయూ బెడ్స్, అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రత్యేక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు రోగుల బెడ్స్ వద్దకు ఆక్సిజన్ సిలెండర్లు మోసుకుని వెళ్లి అమర్చి, రోగులకు ఆక్సిజన్ను పైపుల ద్వారా అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లే దు. సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ ప్లాంట్గా ఆధునీకరించారు. పేషం ట్ల బెడ్స్ వద్దకు పైపులైన్ల ద్వారా ఆక్సిజన్ను అందించే ఏర్పా ట్లు చేశారు. ఇంకా ట్యాబ్లెట్లకు బదులు ఖరీదైన ఇన్హేలర్ను ఇస్తున్నారు. టెస్టులన్నీ రోగులకు ఉచితంగా అందిస్తున్నారు.
ఒకప్పుడు వారానికోమారు రోగుల బెడ్ షీట్స్, పరుపులు మార్చేవారు. రోగులు దుస్తులు కూడా వారం పాటు ధరించాల్సి వచ్చేది. రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మెకానైజ్డ్ లాండ్రి అందుబాటులోకి రావడంతో ఇప్పుడు రోజు విడిచి రోజుకు రోగుల దుస్తులు, బెడ్షీట్స్, పరుపులు మార్చుతున్నారు. 303 బెడ్ల సామర్థ్యంతో రోగులకు సేవలు అందిస్తున్నారు. ఐసీయు బెడ్స్ గతంలో 10 ఉండేవి. ఇప్పు డు వాటి సంఖ్యను 30కు పెంచారు. కరెంట్పోతే ఇబ్బంది పడకుండా రూ.40 లక్షలతో ఆటోమెటిక్ జనరేటర్ను ఆసు పత్రిలో అందుబాటులోకి తెచ్చారు.
ఇక్కడికొచ్చే పేద రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్యసేవలు అందిస్తున్నారు. రూ.2.5 కోట్ల వ్య యంతో సీటీ స్కాన్ను ఏర్పాటు చేశారు. గతంలో సీటీ స్కా న్ కోసం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రోగులు వెళ్లా ల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పనిలేదు. ఆస్తమా, టీబీ పేషంట్లకు ప్రతివార్డులో పోర్టబుల్ ఎక్స్రేలను పేషంట్ల వద్దకే వెళ్లి తీసుకుంటున్నారు. రోజూ రోగులకు పౌష్టికాహారం అందుతోంది.
దేశంలోనే రెండో అలర్జీ క్లినిక్గా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి రికార్డులకెక్కింది. తెలుగు రాష్ర్టాల్లో మొట్ట మొదటిది. అలర్జీ రోగులకు రూ.8 వేలు విలువ చేసే 6 నుంచి 10 ఇంజెక్షన్లు ఉచితంగా ఇస్తున్నారు. తెలుగు రాష్ర్టాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ల నుంచి రోగులు ఈ దవాఖానాకు వస్తున్నారు. గతంలో ఓపీ రోగుల సంఖ్య 200 మంది వరకు ఉండగా, ఇప్పుడు 450 నుంచి 500 మంది రోగులకు నిత్యం వస్తున్నారు. రోగుల కాలక్షేపం కోసం 5 వార్డులకో కలర్ టీవీని ఏర్పాటు చేశారు. రోగుల సంఖ్య పెరగడంతో అలర్జీ క్లినిక్ను ప్రతి బుధవారం, ప్రతి శనివారం వారానికి రెండు రోజులు అలర్జీ క్లినిక్ను ఏర్పాటు చేశారు.