బండ్లగూడ : బస్తీలలో చెత్త చేదారం పేరుకు పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన డోజర్ వాహనం, మొక్కలను నీటిని అందించేందుకు మంచినీటి ట్యాంకర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో పాటు మెయర్ మహేందర్గౌడ్, డిప్యూటి మెయర్ రాజేందర్రెడ్డితో కలిసి జెండా ఉపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా పని చేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకోవల్సి అవసరం మనందరిపైన ఉందన్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, శానిటేషన్ మేనేజర్ మనోహర్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్రెడ్డి, ప్రశాంత్నాయక్, కోఅప్షన్ సభ్యులు జగదీష్, మాలాకీ రత్నం, వెంకట్రెడ్డి, నాయకులు రావుల కోళ్ల నాగరాజు, పాండు, రాజిరెడ్డి, ప్రేంగౌడ్, నరేందర్, దశరత్, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.