హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంత్యోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్’ కార్యక్రమం నిర్వహించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి, హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్ అవార్డుల ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.