ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది. మ్యాచ్ను వీక్షిస్తున్నంత సేపు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ.. వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ..తమ అభిమాన క్రీడాకారులను ఉత్సాహపరిచారు.