సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు నెట్ వర్లో అతిపెద్ద జంక్షన్ అయిన అమీర్పేట మెట్రోస్టేషన్లో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలందించడానికి ప్రత్యేక క్లినిక్ను శుక్రవారం ప్రారంభించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్, టెలిమెడిసిన్ సర్వీసెస్గా వ్యవహరించనున్న ఈ క్లినిక్లో అస్వస్థతకు గురైన మెట్రో ప్రయాణికులకు అత్యవసర సేవలందిస్తామని ఎల్అండ్టీ మెట్రో రైలు సీఓఓ, వైస్ ప్రెసిడెంట్ సుధీర్ చిప్లూంకర్ తెలిపారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ కళ్యాణ్ మురమళ్ల మాట్లాడుతూ..సీ లెవల్ ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన క్లినిక్లో అస్వస్థతకు గురైన రోగులకు ప్రాథమిక చికిత్స అందిస్తామని, అనంతరం రోగి స్థితిగతులను బట్టి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఈ క్లినిక్ ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకూ రోజూ పని చేస్తుందని ఆయన వెల్లడించారు.