మన్సూరాబాద్ : తెలంగాణ వ్యతిరేకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తొత్తు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సతీష్రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి పిండ ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను రాజకీయం చేసేంత దిగజారుడుతనానికి రేవంత్రెడ్డి దిగడం హేయమైన చర్య అన్నారు.
రాహుల్గాంధీ పుట్టుకనే ప్రశ్నించిన బీజేపీని ఎదిరించిన మహానాయకుడు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి విమర్శించడం వారి నీచ బుద్దికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి, సతీష్యాదవ్, శిల్పారెడ్డి, షఫీ, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.