సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైళ్ల రాకపోకలు సాఫీగా సాగిపోవడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ డివిజన్ పరిధిలోని మూడో రైలు మార్గాన్ని స్టేషన్ల వారీగా అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ.. వేగంగా విద్యుదీకరణ పనులను కూడా పూర్తి చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
కొనసాగింపుగా తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్- గద్వాల స్టేషన్ల పరిధిలో 72.7 కిలో మీటర్ల మేర విద్యుదీకరణ పనులను పూర్తి చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. దీంతో ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతాయని పేర్కొన్నారు.