బండ్లగూడ, ఏప్రిల్ 8: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. చిన్నపాటి గాలి దుమారానికే కరెంటు ఉండటం లేదు. దీంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. కరెంటు కోసం అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వచ్చిన గాలిదుమారానికి పలు ప్రాంతాల్లో వైర్లు తెగిపడటంతో స్థానికులు రాత్రంతా జాగారం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. కిస్మత్పూర్లో ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడంతో మెయిన్ విద్యుత్ లైన్ ఈ నిర్మాణానికి తగలడంతో కరెంట్ కట్ అయ్యిందని స్థానికులు తెలిపారు.