హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్ దగ్ధమైంది. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎమర్జెన్సీ స్విచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు బస్ అంతా వ్యాపించాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న మరికొన్ని బస్లను దూరంగా తరలించడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్ విలువ రూ.3కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.