రంగారెడ్డి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ)/కొండాపూర్, ఏప్రిల్ 10 : ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు ఓటు హకును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఓటు హకు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుంచి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో నిర్వహించిన 2కె రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 2కె రన్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతిని చాటారు.
అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లు, యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్స్, సైకిలిస్ట్ అసోసియేషన్స్, పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 2కె రన్లో భాగస్వాములయ్యారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన 2కె రన్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హకును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో 3.30 కోట్ల ఓటర్లు ఉన్నారని, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హకు వినియోగించుకోనైట్లెతే ఓటు వృథా అవుతుందన్నారు.
పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒకరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బాధ్యతగల పౌరులుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని,‘సి’విజిల్ యాప్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోపు విచారణ చేసి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 2కె రన్లో పాల్గొన్న ప్రతి ఒకరూ తమ ఇంట్లోవారిని, చుట్టుపకల వారిని తమ ఓటు హకును సద్వినియోగం చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు.
బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పదని, మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నప్పటికీ ఓటింగ్ శాతంలో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతమైనప్పటికీ, అందరూ చదువుకున్న వాళ్లు ఉన్నప్పటికీ ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈ నెల 15లోగా ఫారం-6లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటు హకు ఉన్న వారందరూ మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు.
శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గమని, ఏడు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. ఆదాయం, చదువులో మాత్రమే కాదు.. సామాజిక బాధ్యతలో కూడా ముందున్నామని ఇక్కడి ప్రజానీకం నిరూపించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఓటర్లు తమ వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు.
ఓటు హకు ఉన్న ప్రతి ఒకరూ ఓటు వేసేలా ఇంటిలో, ఆఫీసుల్లో, బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలని కోరారు. 2కె రన్ అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. 2కె రన్లో టాప్గా నిలిచిన ఐదుగురికి మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీశ్, ఏసీపీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.