సుల్తాన్బజార్, ఫిబ్రవరి 16 : దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హైకోర్టు జడ్జి వామన్రావు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి, అర్చక, ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులు చిలకమర్రి శ్రావణ కుమారాచార్యులు, జక్కాపురం నారాయణ స్వామి, కాండూరి క్రిష్ణమాచారితో కలిసి మొట్టమొదటిసారి దేవాదాయ అర్చక, ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లవేళలా పాటుపడుతానని అన్నారు. అర్చక, ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియామకం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అర్చక, ఉద్యోగుల వెల్ఫేర్ బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ నవీన్మిట్టల్, విశ్రాంత జడ్జి వామన్రావు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ను సన్మానించారు.