మల్కాజిగిరి, నవంబర్ 13: ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆమె టెంపుల్ అల్వాల్లో పాదయాత్ర చేపట్టి.. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఇప్పటికే డ్రైనేజీ కాలువలోని పూడికను తీయించి.. సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. పాడైన విద్యుత్ పోల్స్ను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల ఏర్పా టుకు కాలనీవాసులు ముందుకు రావాలన్నారు. మరోసారి అధికారులతో సర్వే నిర్వహించి అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు. కార్యక్రమంలో కవిత, ఇషాక్, జ్యోతి, రషీద్, తదితరులు పాల్గొన్నారు.