చర్లపల్లి/రామంతాపూర్, జనవరి 13 : చర్లపల్లి భరత్నగర్ రైల్వేక్రాసింగ్ ఆర్ఓబీ బ్రిడ్జి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ బ్రిడ్జి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అన్నారు.
డివిజన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి ..
చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని భరత్నగర్, ఈసీనగర్, చర్లపల్లిలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, గరిక సుధాకర్, గిరిబాబు, అనిల్ ముదిరాజ్, పద్మారెడ్డి, రెడ్డినాయక్, దశరథ్రెడ్డి, నవనీత తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి ..
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. పెద్ద చర్లపల్లిలో దుర్గామాత భవన నిర్మాణ కార్మిక సంఘం, సెంట్రింగ్ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొదించిన క్యాలెండర్ను మేడ్చల్ జిల్లా కార్మిక శాఖ అధికారులు రాజేశ్వర్, సాయి సుమన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సెక్టార్ ఎస్సై సాయికుమార్, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, దుర్గామాత భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ వంశరాజు, మందుల మల్లేశ్, సత్తయ్య, పద్మారెడ్డి, గిరిబాబు, అనిల్, లక్ష్మయ్య, రెడ్డినాయక్, నవనీత, నర్సింహ పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటునందించండి..
దేవాలయాల అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం పాతరామంతాపూర్లోని మల్లికార్జునస్వామి దేవాలయం అభివృద్ధి కోసం దాత మర్రి రంజిత్రెడ్డి రూ. లక్ష నగదును ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చేతుల మీదుగా ఆలయ ప్రధా నార్చకుడు మోత్కూరి శేఖర్బాబుకు అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ చైర్మన్ దయాకర్రెడ్డి, ముత్యాల పాండు, ప్రశాంతి బాల్రెడ్డి, సర్వ కృష్ణయాద వ్, ఆనంద్, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గ డ్డం రవికుమార్, గంగిడి కృష్ణారెడ్డి, గరిక సుధాకర్, జేసీబీ రాజు, వేముల సంతోష్రెడ్డి, సూరంశంకర్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ ..
హబ్సిగూడ డివిజన్ వెంకట్రెడ్డి నగర్ కురుమ సాం ఘీక సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం రాంరెడ్డినగర్ మల్లికార్జునస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి ఆవిష్కరించారు. ఆ సం ఘం అధ్యక్షుడు అల్లం కొమురయ్య, ప్రధాన కార్యదర్శి వనంకండ్ల వెంకటేశ్, కోశాధికారి చెవెళ్లి కిశోర్, సంఘం నేతలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రజక వృత్తి దారుల సంఘం..
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శుక్రవారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుమ్మడిరాజు, ప్రధాన కార్యదర్శి నరే శ్, సంఘం సభ్యులు ఆశయ్య, నరేందర్, బీఆర్ఎస్ నా యకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గోదా రంగనాయకుల కల్యాణం..
సత్యనారాయణ నగర్లోని కోదండరామాలయంలో శుక్రవారం గోదా రంగనాయకుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ యాదవరెడ్డి, సభ్యులు మల్లారెడ్డి, ప్రదీప్రెడ్డి, కొండల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీ చారి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కె. రవీందర్రెడ్డి, గంగిడి కృష్ణారెడ్డి, నందికంది శివ, పుట్ట కృష్ణ పాల్గొన్నారు.