అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిఫష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన అత్తాపూర్ హనుమాన్నగర్లో పర్యటించి స్థానికంగా 2 సంవత్సరాలుగా నెలకొన్న డైనేజి అవుట్లైన్ సమస్యను పరిఫ్కరించారు.
డైనేజీ అవుట్లైన్ లేకపోవడంతో కాలనీలో డైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో స్థానికులు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలుపడంతో ఆయన కాలనీ పక్కనే ఉన్న భూముల యజమానులతో మాట్లాడీ మురుగునీటి పైప్లైన్ వేసేవిధంగా భూ యజమానులను ఒప్పించారు. వెంటనే జలమండలి అధికారులు డ్రైనేజీ అవుట్లైన్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసినా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… హనుమాన్నగర్ కాలనీలో ఎన్నోరోజులుగా ఉన్న డైనేజీ సమస్యకు పరిష్కరించామని తెలిపారు. రాజేంంద్రనగర్ నియోజకవర్గంలో సమస్యలను లేకుండా చేయాలన్నదే తన ద్యేయం అన్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమాచారం అందిస్తే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
అధికారులు కూడా సమస్యలను వెనువెంటనే గుర్తించి పరిష్కరించాలన్నారు. బస్తీల ప్రజలకు కనీస సౌకర్యల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని పేదలకోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలన్నారు.
అనంతరం హనుమాన్నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేందర్రెడ్డి, చెరకు అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, జీహెచ్ఎంసీ వార్డుకమిటి సభ్యుడు మిద్దెల సురేష్రెడ్డి, శ్రీదర్రెడ్డి, మహేష్, సంతోష్ తదితరులు పాల్గోన్నారు.