చర్లపల్లి, నవంబర్ 9 : నియోజకవర్గ పరిధిలోని కాలనీలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్కు చెందిన ఈసీఐఎల్ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ ప్రతినిధులు కొత్త సీవరేజ్ పైప్లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో నూతన పైప్లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాలనీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమయ్యచారి, కాలనీ ప్రతినిధులు రాజేశ్వర్రావు, సుదర్శన్రెడ్డి, జనార్దన్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గృహాల క్రమబద్ధీకరణకు చర్యలు
కాప్రా డివిజన్, కేసీఆర్ కాలనీలో గృహాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కేసీఆర్ కాలనీలోని గృహాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు దొమ్మాటి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రవి, ప్రవీణ్చారి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.