ముషీరాబాద్/చిక్కడపపల్లి, జూన్ 20 : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత నగరంలో పాఠశాలల రూపురేఖలు మారాయని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చక్కటి భవనాలు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం అన్నం, రాగిసంకటి, విద్యార్థులకు ఇతర వస్తువులు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించడంతోపాటు సుశిక్షితులైన అధ్యాపకులచే బోధన చేపట్టడం మూలంగా కార్పొరేట్కు ధీటైన ఫలితాలు వస్తున్నాయని, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలు సర్కారు బడుల్లో చేరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిక్మెట్ కార్పొరేటర్ సునీతాగౌడ్, ముషీరాబాద్ మండల డిప్యూటీ డీఈఓ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారామణి, భవానీ, అధ్యాపకులు నర్సింహారెడ్డి, రవీందర్, రమేశ్, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహా, కె.సురేందర్, అనూరాధ, ముచ్చకుర్తి ప్రభాకర్, రామాలయం చైర్మన్ రవియాదవ్, టి.సోమసుందర్, దీన్దయాళ్రెడి పాల్గొన్నారు. డూపభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వెయ్యడంతో నాణ్యమైన విద్యకు మారుపేరుగా ప్రభుత్వ పాఠశాలలు నిలస్తున్నాయని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవరం విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాగి జావ పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్కూల్ యూనిఫాంలను విద్యార్థులకు అందజేశారు. లో డీప్యూటీ డీఈఓ చిరంజీవులు, పాఠాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేశ్, శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్రెడ్డి, దేవయ్య, దీన్దయాశ్రెడ్డి, వెంకటేశ్, హన్మంతు, నిథిన్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంత చేకూరుతుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం శ్రీ రాంనగర్ బీస్తీలోని ఎల్లమ్మ దేవాలయంలో జ్ఞానేశ్వర్ (డీజే కన్న) ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్, యుజన విభాగం నాయకుడు ముఠా జయసింహ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.