హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఈసీఐఎల్ ఉద్యోగిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఐఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉద్యోగి రవికుమార్.. నిరుద్యోగుల నుంచి భారీ నగదు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించమని అడిగేసరికి రవికుమార్ ముఖం చాటేస్తున్నాడు.
దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి రూ. 25 లక్షల మేర వసూలు చేశాడని 12 మంది ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మొత్తం 30 మంది నుంచి రూ. కోటికి పైగా రవి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న రవి కుమార్ను పోలీసులు విచారిస్తున్నారు.