ఈస్ట్ జోన్ డీసీపీ చక్రవర్తి
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 25: పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతోపాటు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి పోటీ పరీక్షల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈస్ట్జోన్ పోలీసులు, చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సంయుక్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగం సాధించాలంటే పట్టుదల ఎంతో అవసరమన్నారు. ఈకార్యక్రమంలో ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్, అడిషనల్ డీసీపీ మధుకర్స్వామి, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ సీఐ రమేశ్నాయక్, ఫ్యాకల్టీలు సంజయ్, విష్ణువర్ధన్రెడ్డి, మిట్టపల్లి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.