అడ్డగుట్ట, అక్టోబర్ 18 : గత తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు కళ్లేదుటే ఉన్నాయని, తమ విజయానికి ఈ అంశాలు బాటలు వేస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా బుధవారం అడ్డగుట్ట డివిజన్లోని లాలాగూడ, బడీ మజీద్, లిల్లీ మోడల్ స్కూల్, శాంతినగర్, వాటర్ ట్యాంక్ లైన్, శేషాపహాడ్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వృద్ధ్దులు, మహిళలు, మైనార్టీ నేతలు స్వచ్ఛందంగా పద్మారావుకు సంపూర్ణ మద్దుతు తెలిపారు. ఉదయం 10 గంటలకు లాలాగూడ బడీ మజీద్ వద్ద ప్రారంభమైన ప్రచారం సాయంత్రం 5 గంటలకు శాంతినగర్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పద్మారావుకు బొట్టు పెట్టి.. మంగళ హారతులతో ప్రచారానికి ఘనస్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో యాభైయేళ్లకు సరిపడ అభివృద్ధ్దిని చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీదే అధికారమని, సికింద్రాబాద్లో కూడా హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు.
50 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన తుకారాంగేట్ ఆర్యూబీ నిర్మాణాన్ని రూ.72 కోట్లతో చేపట్టామని, రూ. 6 కోట్లతో శాంతినగర్ రిజర్వాయర్ను నిర్మించామన్నారు.
లోహియనగర్లో బండరాళ్లు గుడిసెలపై పడకుండా రూ. 32 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మించామని, అంతేకాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారు 21 వేల మందికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని, అందులో 4044 మంది అడ్డగుట్ట ప్రజలు ఫించన్ పొందుతున్నారని ఆయన తెలిపారు.
అడ్డగుట్టలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.13.05 కోట్ల వ్యయంతో ఇటీవలే ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, అదేవిధంగా రూ.30 లక్షల ప్రత్యేక నిధులతో అడ్డగుట్టలోని రెండు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేశామని ఆయన గుర్తు చేశారు. సికింద్రాబాద్లోని నిధుల విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట, సీతాఫల్మండి, మెట్టుగూడ, బౌద్ధనగర్ కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, సామల హేమ, రాసూరి సునీత, కంది శైలజా, యువ నాయకులు కిశోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్గౌడ్, త్రినేత్ర గౌడ్, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, పార్టీశ్రేణులు నక్కమధు, శ్రీనివాస్ గౌడ్, పెండెం మనోహర్, గీత దయాకర్, పొన్నాల రాజు, కైరంకొండ యాదగిరి, అమర్, శివకుమార్, విక్కుర్తి పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్,అక్టోబర్18: డిప్యూటీ స్పీకర్,సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ ప్రచార పాదయాత్ర అడ్డగుట్ట డివిజన్ శాంతినగర్లో జరిగింది. ప్రచార పాదయాత్రకు సీతాఫల్మండి డివిజన్ నుండి కార్పొరేటర్ సామల హేమతో పాటు నాయకులు,కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు కరాటేరాజు,మాదిరెడ్డి జలందర్రెడ్డి,సుంకురాంచందర్,గరికపాటి చంద్రశేఖర్,రాజాసుందర్,నవీన్చారి,నవీన్గౌడ్ ,పింకి ,ఎర్రజ్యోతి పాల్గొన్నారు.
అడ్డగుట్ట చంద్రయ్య హోటల్ నుండి గురువారం(నేడు) డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహిస్తారని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఉదయం 10 నుండి ప్రచారం ప్రారంభమవుతుందని, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె సూచించారు.