దుండిగల్, మార్చి12 : పెట్రోల్ బంక్లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్పల్లిలోని సిద్ధివినాయక ఫిల్లింగ్ స్టేషన్లో ఈ నెల 11న రాత్రి 10.20 సమయంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహనం (టీఎస్ 08 హెచ్క్యూ 5721)లో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చారు.
అదే సమయంలో మిషన్ హ్యాంగ్ కావడంతో 5 నిమిషాలు ఆగాలని బంక్ కార్మికుడు కోరాడు. దీంతో కోపోద్రిక్తులైన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బంక్లో పని చేస్తున్న బీ.శ్రీకాంత్, జే.అనిల్పై దాడికి దిగారు. పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రామ్లాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.