Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్ఫోన్ తదితర రూ.49లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ డాక్టర్ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ నారాయణ కథనం ప్రకారం.. నగరంలోని ఖాజీపురాకు చెందిన మహ్మద్ హమీద్ అలీ అలియాస్ ముసైబ్ గంజాయి, డ్రగ్స్కు బానిసయ్యాడు.
అంతటితో ఆగకుండా డ్రగ్స్ సేవించడంతో పాటు విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ నెల 3న రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్సాగర్ ఔటర్ సర్వీస్ రోడ్డులో కారులో వచ్చిన హమీద్ డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రూ.49లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.