హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ రెండో రోజు కస్టడీ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు టోనీని విచారించారు. ప్రధానంగా మనీ ట్రాన్సాక్షన్స్పై టోనీని ప్రశ్నించారు. తన ఫ్రెండ్ ఏ2 ఇమ్రాన్ అకౌంట్ ద్వారా టోనీ లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇమ్రాన్ అకౌంట్కు వ్యాపారవేత్తలు మనీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇమ్రాన్ అకౌంట్ నుంచి ఆ డబ్బు టోనీకి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఓ నైజీరియన్ డ్రగ్స్ బిజినెస్ను టోనీకి అప్పగించినట్లు గుర్తించారు. డ్రగ్స్ అమ్మకాలపై పలు వివరాలను పోలీసులు రాబట్టినట్టు సమాచారం. వ్యాపారవేత్తలతో టోనీ నేరుగా మాట్లాడేవాడని పోలీసులు గుర్తించారు. టోనీ వెళ్లిన ఈవెంట్స్, పబ్స్, రేవ్ పార్టీలపై పోలీసులు ఆరా తీశారు. ఇమ్రాన్ షేక్, నూర్ అహ్మద్తో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, స్టార్బాయ్తో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు.