మేడ్చల్ జోన్ బృందం, డిసెంబర్ 6: సమ సమాజ స్వాప్నికుడు డాక్టర్.బీఆర్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంబేద్కర్ వర్ధంతిని పలు పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిమ్నవర్గాల నుంచి వచ్చిన అంబేద్కర్ సమాజంలో వారి కష్టాలు, వివక్షను గుర్తించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల సమాన హక్కులు కల్పించారన్నారు.
మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు దేవరాజ్, మహేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయాణ తదితరులు పాల్గొన్నారు. కీసరలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, అంబేద్కర్ సంఘం నాయకులు రవీందర్, శ్రీనివాస్, ఎంపీటీసీలు నారాయణశర్మ, కిరణ్జ్యోతి, వెంకట్రెడ్డి, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పీర్జాదిగూడ 16వ డివిజన్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతిలో మేయర్ వెంకట్ రెడ్డి, నాయకులు సతీశ్గౌడ్, రవీందర్, బుచ్చియాదవ్ పాల్గొన్నారు.
నాగారం, రాం పల్లి, దమ్మాయిగూడ, అహ్మద్గూడ, రాజీవ్గృహకల్ప కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీతశ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అంబేద్కర్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘా ల నేతలు నివాళులర్పించారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్ చౌరస్తాలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.