అల్వాల్, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దేశ బాంధవుడని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, సబితాకిశోర్ గౌడ్తో కలిసి ఆయన అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికి మనదేశ ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. దళితులను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. బీజేపీకి అంబేద్కర్పై గౌరవం, ప్రేమ ఉంటే ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు సురేందర్రెడ్డి, ఉదయ్కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
దళిత గిరిజన సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షురాలు సబ్బి గాయత్రి, టీఆర్ఎస్ నాయకులు జ్యోతి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే.. భూదేవి నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి వెస్ట్ వెంకటాపు రం కార్పొరేటర్ సబితాఅనిల్ కిశోర్ నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతలు అనిల్ కిశోర్ గౌడ్, ముత్యాలు, ప్రభాకర్, రఘునాథ్, విజయశేఖర్, సురేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.
డిసెంబర్ 6 : మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతంనగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ల పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈస్ట్ ఆనంద్బాగ్లో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మేకల సునీతా రాముయాదవ్, సర్కిల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంద భాస్కర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, సత్తయ్య, సిద్ధిరాములు, ఉపేందర్, బాబు, సత్యనారాయణ, మోహన్రెడ్డి, రాందాస్ సంతోశ్, దుర్గేశ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్, డిసెంబర్ 6 : నేరేడ్మెట్, యాప్రాల్, జేజేనగర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేరేడ్మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉపేందర్రెడ్డి, కరంచంద్, జీవకన్, ఎస్ఆర్ ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, చెన్నారెడ్డి, శివ, రాజు, మహేశ్, రమేశ్, రాజేశ్, మోహన్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శైలజ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ తరుపున రమేశ్ తదితరులు పాల్గొన్నారు.