సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) :వార్తా పత్రికలు, కేబుల్ చానెల్లో వచ్చే పెయిడ్ న్యూస్ను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని సందర్శించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వార్తలను జాగ్రత్తగా పరిశీలించి అవి పెయిడ్ న్యూస్ అని తెలిసిన వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం ౧౯౫౦ కాల్ సెంటర్ను సందర్శిస్తే.. వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించారు.