మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : మహిళల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకోసం రాష్ట్రంలో 372 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అన్ని ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 18వ వార్డు బస్తీ దవాఖానలో మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రా న్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ రాజీవ్ గృహకల్పకాలనీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి సహకారంతో కుట్టు శిక్షణ పొందిన 30 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల వైద్యసేవలను అందించి, అవసరమైన వారిని పెద్ద దవాఖానలకు పంపించనున్నట్లు చెప్పా రు. ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా ఇప్పటికే 2,78, 317 మందికి చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలు లేబర్ కార్డును పొందాలని, లేబర్ కార్డు ఉంటేనే భీమాతో పాటు అనేక ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డెరెక్టర్ రాజిరెడ్డి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ రాజమల్లయ్య, వైద్యాధికారులు సరిత, సాయి ఆంకాక్ష, వెంకన్న, కౌన్సిలర్లు శ్రీహరిగౌడ్, నానునాయక్, సుజాత, హేమలత, వెంకటేశ్, స్వప్న, రమేశ్గౌడ్, నరసింహరెడ్డి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్, సెప్టెంబర్ 12: ఆరోగ్య మహిళే తెలంగాణే సీఎం కేసీఆర్ అభిమతమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్లోని అంబేద్కర్నగర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ ప్రతి మంగళవారం మహిళకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలతో పాటు మందులు అందజేస్తుందని అన్నారు. మహిళల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమాని తీసుకురావడంతో ప్రతి ఆడబిడ్డ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో కార్పొరేటర్ ఏకే మురుగేశ్, నాగరాణి వెంకటేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్లు శుష్మ, హరినాథ్, శైలేశ్, ఆరోగ్య విస్తరణ అధికారి షౌకత్అలీ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.