కాప్రా/మల్లాపూర్, ఏప్రిల్ 4: ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల నెరవేరక పేద ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, జీఓ 58 ద్వారా సీఎం కేసీఆర్ పేదల కలలను సాకా రం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్, ఎర్ర లలితాగార్డెన్స్లో జీఓ 58 కింద డివిజన్ పరిధిలోని పేద ప్రజలకు మంజూరైన 408 ఇండ్లస్థలాల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్లు స్వర్ణరా జు, శిరీషా సోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్ ము ఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కాప్రా మండలం తాసీల్దార్ అనితా ఎస్తేరు ఆధ్వర్యంలో జరిగిన ఈ పట్టాల పంపిణీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు పట్టాలను ఇవ్వడంతో వారిలో ధైర్యం పెరిగిందని, ఇండ్లపై పూర్తి హక్కులు వచ్చాయని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ మేలును ప్రజలు ఎన్నడూ మరువలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, ధన్పాల్రెడ్డి, ఏఎస్రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, పిల్లిసాయికుమార్, నాగేశ్వర్ రెడ్డి, ఆర్ఐ ఆనంద్, సాయి, రెవెన్యూ సిబ్బంది, నాయకులు ఎండీ గౌస్, చందు, పవన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు జీఓ 58కింద ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణ, పంపిణీని ప్రజలు ఎన్నటికీ మరువలేరని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లోని యాదగిరి ఫంక్షన్హాల్లో జీఓ 58 కింద ఇండ్లస్థలాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేసి 458 మందికి ఇండ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వస్థలంలో గృహాలను నిర్మించుకున్నా సరైన పత్రాలు లేక ఇబ్బందు లు పడిన ప్రతి పేద కుటుంబానికి జీఓ 58 ద్వారా ఇం టిపై పూర్తి హక్కులు వచ్చాయని, దీనిని వారి గుండెల్లో దాచుకుంటారని అన్నారు. కార్పొరేటర్ ప్రభుదాస్ మా ట్లాడుతూ.. పేద ప్రజలకు ఇండ్లపై పూర్తి హక్కులు రావడంతో వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఉప్పల్ తాసీల్దార్ గౌతమ్కుమార్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, మాజీ కార్పొ రేటర్ గుండారపు శ్రీనివాస్రెడ్డి, శాంతి సాయిజెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్, గరిక సుధాకర్, గడ్డం రవి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.